కృష్ణ, జూలై 9 : మండల కేంద్రంతోపాటు కుసుమూర్తి, తంగిడిగి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి నీళ్లుపోశారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ఆరు మొక్కలను పంపిణీ చే శారు. అలాగే పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. రోడ్లు, మురుగునీటి కాల్వలను పరిశీలించారు. గ్రామంలో సమస్యలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేను సర్పంచ్ రేణుక, గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమ, జెడ్పీటీసీ అంజనమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయపాటీల్, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో పల్లెలు
నారాయణపేట రూరల్, జూలై 9 : మండలంలోని వం దర్గుట్టతండా, అప్పక్పల్లి, మోకహనుమాన్తండా, జా జాపూర్, సింగారం, కోటకొండ, పేరపళ్ల, చిన్నజట్రంతోపా టు పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సా గుతున్నాయు. దీంతో పల్లెలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు పోటాపోటీగా పల్లె ప్రగతి పనులు చేపట్టారు. రోడ్లను ఊడ్చడం, మొక్కలు నాటడం, ముళ్లపొదలు తొలగించ డం, ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ
నర్వ, జూలై 9 : పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా మండలంలోని కల్వాలలో కొనసాగుతున్న పనులను మం డల ప్రత్యేకాధికారి శివప్రసాద్రెడ్డి, ఎంపీడీవో రమేశ్కుమా ర్ పరిశీలించారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద ఆరు మొక్కలను కచ్చితంగా పెంచాలని, మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాలకు అవసరమైన పనులను ప్రజాప్రతినిధులు తీర్మానించుకుని డ్రైనేజీ, అంతర్గత రోడ్ల ఏర్పాటు, విద్యుత్ సమస్యల నివారణ, కంపచె ట్లు, పిచ్చిమొక్కల తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
‘పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి’
ఊట్కూర్, జూలై 9 : పల్లె ప్రగతిలో భాగంగా వివిధ గ్రామాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. మండల కేంద్రంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం, పారిశుధ్య పనులను ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప పర్యవేక్షించారు. పల్లె ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అభివృద్ధిలో అం దరూ భాగస్వాములు కావాలని జెడ్పీ సీఈవో అన్నారు. తి ప్రాస్పల్లిలో సర్పంచ్ సుమంగళ ఆధ్వర్యంలో మహిళా సం ఘాల సభ్యులకు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. చిన్నపొర్ల, పెద్దపొర్ల, నిడుగుర్తి గ్రామాల్లో రోడ్లకు ఇరు వై పులా మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. గ్రా మాల్లో రోడ్ల పక్కన పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించా రు. పలు గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ ఏఈ వెంకటేశ్ ఆధ్వర్యంలో కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి రోడ్డుకు అడ్డంగా తీగలను సరి చేశారు. రోడ్లపై గుంతలను మొర్రం మట్టితో పూడ్చి వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.