కమ్మర్పల్లి/వేల్పూర్/మోర్తాడ్/ ఆర్మూర్, జూన్ 9 : ప్రభుత్వవిప్ బాల్క సుమన్ను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కమ్మర్పల్లి, వేల్పూర్ ఎక్స్రోడ్డు, మోర్తాడ్, ఆర్మూర్ మున్సిపల్లోని కోటార్మూర్లో 44, 63వ నంబర్ల జాతీయ రహదారుల జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కమ్మర్పల్లిలో ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ, పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, బద్దం చిన్నారెడ్డి, బద్దం రాజేశ్వర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వేల్పూర్లో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆర్టీఏ మెంబర్ రేగుల్ల రాములు, సర్పంచ్ తీగల రాధ, ఉప సర్పంచ్ సత్యం, రామన్నపేట్ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, పడగల్ సొసైటీ చైర్మన్ యాల్ల హన్మంతు, సర్పంచులు గంగారెడ్డి, రమేశ్, సుధాకర్ గౌడ్, నితీశ్, రాజ్కుమార్, నాయకులు డొల్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కోటార్మూర్ జంక్షన్ బైపాస్ వద్ద సీఎం కేసీఆర్కు స్వాగతం పలికిన వారిలో టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, ఆర్మూర్ మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు లిక్కి శంకర్, ఆకుల రాము, ఫయాజ్, రహమాన్, టీఆర్ఎస్ నాయకులు పసుల రాజు, అబ్దుల్ నయీం, సుంకరి రవి తదితరులున్నారు. ఆర్మూర్ ఏసీపీ రఘు, ఎస్హెచ్వో సైదేశ్వర్, ఎస్సైలు శ్రీకాంత్, యాదగిరిగౌడ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.