ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గట్టు, ఏప్రిల్ 7 : చివరి ఆయకట్టు వరకూ సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రె డ్డి స్పష్టంచేశారు. మండలంలోని బోయలగూడెంను ఆయన బుధవారం సందర్శించారు. బోయలగూ డెం శివారు ప్రాంతానికి సాగునీటిని అందించి తమ కష్టాలు తీర్చాలని రైతులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇందువాసి వరకు వచ్చిన నెట్టెంపాడు కాలు వ ద్వారా బోయలగూడెం వరకు 3కిలోమీటర్ల పరిధిలో పొడిగించి కెనాల్ ద్వారా నీటిని అందించే విషయంపై ఎమ్మెల్యే బండ్ల పీజేపీ ఇంజినీర్లతో మాట్లాడారు. కెనాల్ పనులను ప్రారంభించడానికి అధికారులకు పూర్తి సహకారం అందించాలని రైతులను కోరారు. భూములు కో ల్పోయే రైతులకు నష్టపరిహారం అందేవిధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కెనాల్ పూర్తయితే మరో 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని స్ప ష్టంచేశారు. కార్యక్రమంలో ఇంజినీర్లు వెంకటేశ్వర్లు, శిరీష, సుధాకర్, ఎంపీపీ విజయ్కుమార్, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, బలిగేర స ర్పంచ్ హనుమంతు, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, రామాంజనేయులు తదితరులున్నారు.