దత్తసాయి ఆలయ ట్రస్ చైర్మన్ జగన్మోహన్
అన్నదాన షెడ్ నిర్మాణానికి రూ. 5లక్షలు విరాళంగా అందజేసిన స్థానిక కాంట్రాక్టర్
నిర్మల్ అర్బన్, జూన్ 17: ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని గండిరామన్న దత్త సాయి ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయ అన్నదాన షెడ్ కోసం నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కే విద్యాసాగర్ రావు రూ.5లక్షలను గురువారం విరాళం గా అందజేశారు. అలాగే పట్టణానికి చెందిన వ్యా పారి ముత్యం సంతోష్ గుప్తా ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.1,11,111, ఆమెడ శ్రీధర్ రూ.50 వేలు, స్థానిక భక్తులు ఎన్ .నర్సారెడ్డి రూ.50 వేలను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధి కోసం పలువురు భక్తులు, దాతల సహకారం మర్చిపోలేనిదన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో ఇప్పటికే ఆలయంలో వివిధ పను లు చేపట్టామని తెలిపారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. సాయిదీక్షా సేవాసమితి సభ్యులు గోపాల్ రెడ్డి, కందుల పండరి ఉన్నారు.