National
- Nov 25, 2020 , 13:52:36
145 కి.మీ. వేగంతో తీరాన్ని తాకనున్న నివర్ తుఫాన్

చెన్నై: నివర్ తుఫాన్ తమిళనాడు, పుదుర్చెరిలను వణికిస్తోంది. ఈ తీవ్ర తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెన్నైకి 56 కిలోమీటర్ల దూరంలోని మలప్పురంలో నివర్ తుఫాన్ గంటకు 145 కి.మీ. వేగంతో తీరాన్ని తాకనుంది. కోస్తా ప్రాంతాల్లో రేపటి వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు చెన్నై బయట ఉన్న చెంబరంబాక్కమ్ లేక్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. దీని కారణంగా చెన్నై అడియార్ నదిలో వరద ప్రవాహం పెరగనుంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఉండే రెండు వేల మందికిపైగా ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజావార్తలు
- బుద్ధవనాన్ని సందర్శించిన సమాచార కమిషనర్
- కూలీల ట్రాక్టర్ బోల్తా
- నాలుగు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- క్రీడలతో మానసిక ప్రశాంతత
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
MOST READ
TRENDING