బంగ్లాదేశ్లో 27 మంది మృతి
ఢాకా, ఏప్రిల్ 5: ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ.. సరుకు రవాణా నౌకను ఢీకొని నీటిలో మునిగిన ఘటనలో కనీసం 27 మంది మరణించారు. బంగ్లాదేశ్లో నారాయణ్గంజ్ జిల్లాలోని శీతలఖ్య నదిలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో లాంచీలో వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, మిగతావారు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు.