కోయిలకొండ, మే 24 : మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి రాంపూర్ గోదాముకు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఏవో రామకృష్ణ సూచించారు. సోమవారం రాంపూర్ గోదాముకు ధాన్యం తరలింపును పరిశీలించారు. గోదాములో ఉన్న గన్నీబ్యాగులను టోకెన్ల వారీగా రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 4లక్షల గన్నీబ్యాగులను అందించామని, 30వేల ధాన్యం బస్తాలను గోదాముతోపాటు ప్రభుత్వ పాఠశాలలో నిల్వ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో కొండారెడ్డి, నాయకులు భీంరెడ్డి, చెన్నారెడ్డి, రాజవర్దన్రెడ్డి పాల్గొన్నారు.