చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సుమారు కిలో 200 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశామని, బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 57.75 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
నాగపట్టిణానికి చెందిన బద్రొద్దీన్ (23) అనే యువకుడు దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానం (ఈకే-54)లో చెన్నై విమానాశ్రయంలో దిగాడు.
విశ్వసనీయ సమాచారం కస్టమ్స్ అధికారులు అతడిని అడ్డుకొని సామగ్రితోపాటు 55 ఇంచుల ఎల్ఈడీని సైతం తనిఖీ చేశారు.
టీవీ వెనుక కవర్ను తొలగించి స్పీకర్లలో రెండు భారీ బంగారు కడ్డీలను తెలివిగా చొప్పించి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.