ఆదివారం అమావాస్యకు పోటెత్తిన భక్తులు
ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
కోయిలకొండ ఏప్రిల్ 11: జిల్లాలో ప్రసిద్ధి చెం దిన శ్రీరామకొండ క్షేత్రానికి ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే భక్తులు కొండకు చేరుకొని అఖండ భజన నిర్వహించారు. తెల్లవారుజామునుంచే మహిమాన్వితమైన కోనేరులో పుణ్యస్నానాలు అచరించి దర్శనం కోసం బారులుదీరా రు. ఎండను లెక్క చేయకుండా రామదర్శనం కోసం తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అదేశాల మేరకు శ్రీరామకొండపై ప్రత్యేక పైపులైన్ వే యించి భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుం డా నల్లాలు ఏర్పాటు చేశారు. క్షేత్రాన్ని మిషన్ భగీరథ అధికారి వెంకటరమణ, ఆలయ చైర్మన్ రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్యయాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్ ప్రత్యే క పూజలు నిర్వహించారు.
పులిహోర, అంబలి పంపిణీ
శ్రీరామకొండకు తరలివచ్చిన భక్తులకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తండ్రి రాజేశ్వర్రెడ్డి స్మారకార్థం పులిహోర, అంబలిని పేట టీఆర్ఎస్ సమన్వయకర్త ఎస్.రవీందర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.