సిమ్లా : కరోనా కట్టడికి హిమాచల్ ప్రదేశ్ లో విధించిన కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 వరకూ పొడిగించింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అధ్యక్షతన శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం రోజూ మూడు గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తామని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ వెల్లడించారు.
మంగళ, శుక్రవారాల్లో హార్డ్ వేర్ షాపులను అనుమతిస్తామని చెప్పారు. ప్రజలు పెండ్లిండ్లను వాయిదా వేసుకోవాలని లేనిపక్షంలో కేవలం 20 మందితో ఇండ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. శుభకార్యాల్లో భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమం జరిగేలా నిర్వాహకులు బాధ్యత చేపట్టాలని పేర్కొన్నారు.