దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకోగా.. బౌలర్ల విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రెండు అర్ధశతకాలతో దుమ్మురేపిన కోహ్లీ 857 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. మూడో స్థానంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (825) ఉన్నాడు. పెండ్లి కారణంగా ఇంగ్లండ్తో మ్యాచ్లకు దూరమైన బుమ్రా.. బౌలర్ల విభాగంలో ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు చేరాడు. భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 11వ ర్యాంకుకు ఎగబాకాడు.
ఇవి కూడా చదవండి:
ఓవరాల్ చాంప్ అండమాన్ నికోబార్