హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ( RLD)జాతీయ అధ్యక్షుడు అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమన్నారు. అజిత్ సింగ్ మరణంతో మంచి స్నేహితుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి మొదటి నుంచి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అజిత్ సింగ్ అని ఆయన తెలిపారు.
వాజపేయి హయాంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమానికి సహకారం అజిత్ సింగ్ అందించారని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని సుఖేందర్ రెడ్డి భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం