హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఎలాంటి పని చేయకుండా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలనుకొనే యువత క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లకు ఆకర్షితులవుతున్నారు. అవగాహన లేకున్నా పెట్టుబడి పెట్టి నష్టాలను చవిచూస్తున్నారు. అసలు క్రిప్టో కరెన్సీని నమ్మవచ్చా? దాని పర్యావసానాలు ఏంటి? అంటే.. క్రిప్టో కరెన్సీకి భారత్లో పూర్తిస్థాయి అనుమతులు లేవు. దానితో బ్లాక్మనీ చేతులు మారే అవకాశం ఉండటం, ఎక్కడైనా చెల్లుబాటయ్యే వెసులుబాటు ఉండటంతో ఈ కరెన్సీని అనుమతించాలా? వద్దా? అనే అంశం ఇంకా పరిశీలనలోనే ఉంది. మనదేశంలో ఇప్పటికే 70 లక్షల మంది క్రిప్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తిస్థాయినిషేధం విధించబోమని,కాకపోతే కొత్త సాంకేతికత, వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది రానప్పుడే అనుమతిస్తామని ఇటీవలే కేంద్రప్రభుత్వం చెప్పింది. దీంతో ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వజ్రిక్స్, కాయిన్స్ స్విచ్, బినాన్స్తో పాటు భారత్పే, ఓక్టాఎఫ్ఎక్స్, ఒలెంపీ ట్రేడ్, ఐక్యూ ఆప్షన్, గురు ట్రేడ్ లాంటి ట్రేడింగ్ యాప్లలో విచ్చలవిడిగా పెట్టుబడులు పెడుతున్నారు.
యాప్లను నమ్మవచ్చా?
క్రిప్టోకరెన్సీ, ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లు మంచివా, చెడ్డవాఅనే విషయం పక్కనపెడితేపాన్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్, చిరునామా మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని యాప్లకు ఇవ్వాల్సివ స్తుంది. బ్యాంకులు, ప్రభుత్వానికి మా త్రమే ఇచ్చే వ్యక్తిగత సమాచారం ఈ యాప్లు అడుగుతున్నాయి. దీంతో వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థంగా మారుతున్నది. క్రిప్టోకరెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చాక, నిబంధనల మేరకున్న కరెన్సీ, గుర్తింపునిచ్చిన యాప్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది.
ఆన్లైన్ గేమ్స్కు అనుమతి లేదు
ఆన్లైన్ రమ్మీ, క్యాసినో (జూదాలను ప్రోత్సహించే) గేమ్స్కు తెలంగాణలో అనుమతులు లేవు. అయినా ఫేక్ జీపీఎస్ ద్వారా ఈ యాప్లు చలామణిఅవుతున్నాయి. అంటే తెలంగాణలోఆడే వ్యక్తి వేరే దేశం నుంచి ఆడుతున్నట్టు చూపిస్తుంది. ఇలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకొని, మన బ్యాంకు అకౌంటువివరాలు ఇవ్వడం సరికాదు. మన వ్యక్తిగత వివరాలు సులభంగా ఇతర దేశాల వారికి తెలిసిపోయే ప్రమాదం ఉం ది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.