చండూరు, మార్చి 30 : తుమ్మలపల్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం విమాన రథోత్సవం వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోటి విడుదల చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పెద్దగోని వెంకన్న, యువజన విభాగం అధ్యక్షుడు ఉజ్జిని అనిల్రావు, బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షుడు గజ్జెల కృష్ణారెడ్డి, సర్పంచ్ కురుపాటి రాములమ్మ, కురుపాటి సుదర్శన్, కొండారెడ్డి వెంకట్రెడ్డి, కావలి మంగమ్మ ప్రసాద్, గండూరి జనార్దన్, రవి, శేఖర్, వెంకన్న, లక్ష్మయ్య, కొంపల్లి వెంకటేశ్, శ్రీహరి, నరేశ్, రవి, వెంకన్న, శేఖర్, శ్రీను, యాదయ్య పాల్గొన్నారు.
దర్వేశిపురంలో భక్తుల కోలాహలం
కనగల్, మార్చి 30 : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
నేడు భక్తులకు గాజుల పంపిణీ
చిట్యాల, మార్చి 30 : కనకదుర్గ అమ్మవారి 18వ వార్షికోత్సవం సందర్భంగా దేవికి ప్రత్యేకంగా అలంకరించిన లక్ష గాజులను ఈ నెల 31న భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ వేలుపల్లి మధుకుమార్ తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఘనంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం
నార్కట్పల్లి మార్చి 30 : స్థానిక పట్టణంలో ప్రజ్ఞాపురం కోటయ్య, రామకృష్ణ, సత్యనారాయణ ఇంటి దగ్గర.. అలాగే రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాజ యాదయ్య, మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, బోయపల్లి శ్రీను, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.