కోనరావుపేట, ఏప్రిల్ 8 : స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా గీత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నది. తగ్గిపోతున్న ఈత, తాటి వనాలతోపాటు కల్లు బాగా ఇచ్చే గిరుక తాళ్ల పెంపకం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. హరితహారంలో భాగంగా ఈ మొక్కలను అందిస్తున్నది. కోనరావుపేట మండలంలోని సుద్దాలలో గీత కార్మిక సంఘం ప్రభుత్వం ఇచ్చిన గిరుక, ఈత తాటి వనాలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. 26వేలకు పైగా గిరుక, ఈత మొక్కలను ఎక్సైజ్ శాఖ అందించింది. ఆ మేరకు మరిమడ్ల, వట్టిమల్ల, బావుసాయిపేట, సుద్దాలతోపాటు పలు గ్రామాలలో వనాలను పెంచుతున్నారు. సుద్దాల గౌడ సంఘం ఆధ్వర్యంలో మూడెకరాలలో 200 గిరుక తాళ్లు, 2వేల ఈత మొక్కలను రెండేళ్ల క్రితం నాటారు. ప్రత్యేకంగా వన సంరక్షకుడిని కేటాయించారు. అతనికి అదే భూమిలో గిరక తాళ్ల కింద కూరగాయాల సాగుతో ఉపాధి కల్పిస్తున్నారు. వెంకట్రావుపేటకు చెందిన పల్లం సత్తయ్య సహకారంతో బోరుమోటరు వేయించారు. ఆ మోటరుతో నిత్యం నీళ్లు పెడుతున్నారు. ప్రస్తుతం చెట్లు కల్లు గీసే స్థాయికి చేరాయి. గీత కార్మికులకు ఆసరాగా ఉండబోతున్నాయి.
ఇవి కూడా చదవండి..
దొరికిపోయాడు..ఆడేసుకుంటున్నారు
బల్దియా ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం