కొత్తూరు,ఏప్రిల్ 26:టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్వాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. 2వ వార్డు అభ్యర్థి చంద్రకళ రాజేందర్, 3వ వార్డు అభ్యర్థి కోస్గి శ్రీనును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారం సందర్భంగా తిమ్మాపూర్ పరిధిలోని యువత, మహిళలు, పార్టీ శ్రేణులు మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మంత్రి మాట్లాడుతూ అన్నంపెట్టే పార్టీని ఆదరించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఎన్నికలు వచ్చాయంటే కనిపించే పార్టీలు చాలా ఉంటాయని,అలాంటి పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంచి పేదల నడ్డివిరుస్తున్నదన్నారు. కరోనా టీకాలు రాష్ర్టానికి అందించడంలో కేంద్ర ప్రభుత్వ వివక్ష చూపుతున్నదన్నారు. ఎంత ఖర్చయినా ప్రజలకు వ్యాక్సిన్ ఫ్రీగా అందజేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు.
అభివృద్ధి జరుగాలాంటే కొత్తూరు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురాలన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ప్రజలకు ఏ ఆపద వచ్చి నా ఆదుకోవడానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ కొత్తూరు మున్సిపాలిటీలోని 12 వార్డులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.టీఆర్ఎస్ గెలిస్తే నిధులు వరదలా పారుతాయని దాని ద్వారా కొత్తూరును అందంగా తయారు చేసుకునే అవకాశం ఉం టుందన్నారు. 2,3 వార్డుల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు రావద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ, 2వవార్డు అభ్యర్థి చంద్రకళ, 3వ వార్డు అభ్యర్థి కోస్గి శ్రీను, నాయకులు రాజేందర్గౌడ్, దేవేందర్గౌడ్, జనార్దన్రెడ్డి సుఖేందర్రెడ్డి,కార్యకర్తలు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం