రూప్నగర్ ఐఐటీ తయారీ
చండీగఢ్, మే 13: కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు రూప్నగర్ ఐఐటీ ఒక బండిని తయారుచేసింది. దీనికి ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేషన్ వేడిని బయటకుపోనివ్వదు. దీంతో తక్కువ కట్టెలు సరిపోతాయి. చక్రాలున్న ఈ బండిని ఎక్కడైనా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు.