కోల్కతా, మార్చి 17: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కనీస ఆదాయం హామీ, విద్యార్థులకు క్రెడిట్ కార్డులు, రైతులకు ఆర్థిక సహాయం పెంపు వంటి వరాలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. తమ పాలనలో రాష్ట్రంలో పేదరికాన్ని 40 శాతం వరకు తగ్గించినట్టు మమత తెలిపారు.