పనాజీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మే 9వ తేదీ (ఆదివారం) నుంచి 23వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రటించారు. అయితే మెడిసన్ సరఫరా లాంటి అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు.
నిత్యావసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయని గోవా సీఎం వెల్లడించారు. రెస్టారెంట్లలో కేవలం పార్శిల్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని, అది కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. కర్ఫ్యూకు సంబంధించిన పూర్తి నియమాలను శనివారం వెల్లడించనున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ 12 రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్.. కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం
పావురం కాలికి చిప్.. గూఢచర్యమేనా..!
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు