పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు మంత్రి మదన్ సాహ్ని షాక్ ఇచ్చారు. జేడీయూకు చెందిన ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం తెలిపారు. తనకు ఇచ్చిన నివాసం లేదా వాహనంతో తాను సంతృప్తిగా లేనని మదన్ సాహ్ని చెప్పారు. అధికారులు తన మాట వినకపోతే, తాను ప్రజలకు సేవ చేయలేనని చెప్పారు. అప్పుడు ప్రజల పనులు పూర్తి కావని అన్నారు. ప్రజల పని పూర్తి కాకపోతే మంత్రి పదవి తనకు అవసరం లేన్నారు. బ్యూరోక్రసీకి వ్యతిరేకంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మదన్ సాహ్ని వెల్లడించారు. ఇకపై ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు.