కోల్కతా: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సగానికి సగం తగ్గినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 1.4 కోట్ల టీకాలను ఉచితంగా ఇచ్చినట్లు చెప్పారు. చాలా వరకు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేశాయని, కానీ తాము మాత్రం కేవలం ఆంక్షలను విధించినట్లు చెప్పారు. ప్రజలకు తమకు సహకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.