రాయపూర్: కరోనాతో మరణించిన ఒకరి మృతదేహాన్ని ఓపెన్గా ట్రాక్టర్ ట్రాలీలో తరలించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజ్నందన్ గ్రామంలో కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ట్రాక్టర్ ట్రాలీలో తరలించడం వివాదమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసే క్రమంలో తొందర వల్ల ఇలా జరిగి ఉంటుందని పంచాయతీ అధికారి మిత్లేష్ చౌదరి తెలిపారు.
ఛత్తీస్గఢ్లో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా కేసులతోపాటు మరణించిన వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో కరోనా రోగుల మృతదేహాలు ఆసుపత్రుల మార్చురీలలో పేరుకుపోతున్నాయి. శ్మశానవాటికలకు తరలింపు కోసం అంబులెన్స్ల కొరత నెలకొన్నది. అలాగే అంత్యక్రియల కోసం శ్మశానవాటికల వద్ద కరోనా మృతులతో అంబులెన్స్లు క్యూకడుతున్నాయి.