బ్రిస్టల్: టాపార్డర్ రాణించడంతో భారత్తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ మహిళల జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 269 పరుగులు చేసింది. కెప్టెన్ హీతర్ నైట్ (95) తృటిలో శతకం చేజార్చుకోగా.. బ్యూమాంట్ (66), స్కీవర్ (42) రాణించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, దీప్తి 2 వికెట్లు పడగొట్టారు.