న్యూఢిల్లీ: కరోనా కారణంగా హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు భారత హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు వెల్లడించారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సౌదీఅరేబియా తమ దేశస్థులకు, అదీ పరిమిత సంఖ్యలో మాత్రమే హజ్ యాత్రకు అనుమతినిస్తున్నది. బయటవారినెవరినీ అనుమతినివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మక్సూద్ తెలిపారు. గతేడాది కూడా హజ్ యాత్ర రద్దయ్యింది.