బెంగళూర్ : కర్నాటకలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,214 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షల మైలురాయి దాటింది. ఇక 20,94,369 మంది వైరస్ నుంచి కోలుకోగా 4 లక్షల క్రియాశీల కేసులున్నాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే 476 మంది మరణించారు.
బెంగళూర్ నగరంలోనే 5949 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో నగరంలోనే ఒక్కరోజులో 273 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది కరోనా వైరస్ కేసులు వెలుగుచూసినప్పటి నుంచి కర్నాటకలో 27,405 మంది మరణించగా, బెంగళూర్ నగరంలోనే 12,421 మంది ప్రాణాలు కోల్పోయారు.