పనాజీ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన గోవాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రేపటి నుంచి వారంపాటు కొవిడ్ ఆంక్షలు విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు అమలులోకి వస్తామని పేర్కొంది. నిత్యావసర సర్వీసులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
క్యాసినోలు, బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, రివర్ క్రూయిజర్లు, జిమ్స్, పాఠశాలలు, కళాశాలలు, వారాంతపు మార్కెట్లను వెంటనే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సాంఘిక, రాజకీయ, క్రీడ, వినోద, సాంస్కృతి కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించింది. వివాహ వేడుకను 50 మందితో, అంత్యక్రియలను కేవలం 20 మందితోనే జరుపుకోవాలని ఆదేశించింది.
కార్యాలయాలకు వెళ్లే వారు మినహా రోడ్లపై ఐదుగురు కంటే ఎక్కువ మంది తిరగొద్దని సూచించింది. ఉద్యోగులను, అత్యవసర వైద్య సేవల కోసం రోగులు తీసుకెళ్లే బస్సును కేవలం 50 శాతం సామర్థ్యంతోనే నడపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.