లక్నో: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు. వివిధ కేసుల్లో నిందితులైన తండ్రీ కొడుకులు గత నెల 30న కరోనా బారినపడ్డారు. అయితే మే 2 ఆజంఖాన్ను పరిశీలించిన డాక్టర్లు.. అతన్ని దవాఖానకు తరలించాలని జైలు అధికారులకు సూచించారు. అయితే దానికి ఆజంఖాన్ ఒప్పుకోలేదు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం వారు హాస్పిటల్కు వెల్లడానికి అంగీకరించారని, దీంతో తండ్రీ కొడుకులను లక్నోలోని మేదాంత దవాఖానకు తరలించామని డిప్యూటీ జైలర్ ఓంకార్ పాండే తెలిపారు. జైలులో గత 29న మరో 13 మంది కరోనా బారినపడ్డారు.
కాగా, ఆజంఖాన్తోపాటు అతని భార్య తజీన్ ఫాత్మా, కుమారుడు అబ్దుల్లాఖాన్ను గతేడాది ఫిబ్రవరిలో పోలీసులు వంద కేసుల్లో నిందితులుగా పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి వారు సీతాపూర్ జైల్లో ఉంటున్నారు. అయితే 34 కేసుల్లో నిందితురాలిగా ఉన్న తజీన్ ఫాత్మాకు అలహాబాద్ హైకోర్టు గత డిసెంబర్లో బెయిల్ మంజూరు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి