హీరో మోటోకార్ప్ ప్రకటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి విజృంభణతో దేశీయ కార్పొరేట్ కంపెనీలు గడగడలాడుతున్నాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి తమ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ప్రస్తు తం ఆ కంపెనీకి హర్యానాలోని ధరుహెరా, గుర్గావ్తోపాటు చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)హరిద్వార్ (ఉత్తరాఖండ్), నీమ్రానా (రాజస్థాన్), హలోల్ (గుజరాత్)లో ఆరు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. వీటి వా ర్షిక ఉత్పత్తి సామర్థ్యం 90 లక్షల
యూనిట్లు.