ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
వర్ధన్నపేట, ఏప్రిల్ 30 : వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం(90) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. 1978, 1983లో జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గౌడ సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. హన్మకొండ మండలం అల్లి తిమ్మాపురానికి చెందిన జగన్నాథం వరంగల్ పోచమ్మమైదాన్లో నివాసం ఉండేవారు. కుమారుడు హైదరాబాద్తో స్థిరపడడంతో కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. జగన్నాథం మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు.