న్యూఢిల్లీ: హ్యుండాయ్ కంపెనీ నుంచి వస్తున్న మరో ఎస్యూవీ అల్కజార్. 6, 7 సీటర్ ఎస్యూవీ బుకింగ్స్ను హ్యుండాయ్ బుధవారం ప్రారంభించింది. రూ.25 వేల టోకెన్ అమౌంట్ చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. హ్యుండాయ్ క్రెటాకు సెకండ్ జనరేషన్గా ఈ కారు వస్తోంది. హ్యుండాయ్ షోరూమ్కు వెళ్లి లేదంటే సంస్థ వెబ్సైట్లో క్లిక్ టు బయ్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా ఈ కారు బుకింగ్ చేయవచ్చు. ఈ కారు ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో సంస్థ చెప్పలేదు కానీ ఈ నెలాఖరుకల్లా రావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది హ్యుండాయ్ ఎస్యూవీలే అత్యధికంగా అమ్ముడుపోయాయని, క్రెటా, వెన్యూ, టక్సన్, కోనా ఎలక్ట్రిక్లాంటి ఎస్యూవీలు మార్కెట్లో ఉన్నాయని హ్యుండాయ్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు.