బెంగుళూరు: కోవిడ్ సోకిన చిన్నారుల్లో మరణాలు అరుదుగా ఉన్నట్లు ఓ సర్వే పేర్కొన్నది. ఆగస్టు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కర్నాటకలో 166 మంది కోవిడ్ వల్ల మరణించారు. దాంట్లో ఇద్దరు మాత్రమే చిన్నారులు ఉన్నారు. వారిలో ఒకరు 14, మరొకరు 15 ఏళ్లు ఉన్నారు. కోవిడ్ వల్ల పదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలు ఎవరూ చనిపోలేదని సర్వే తేల్చింది. కర్నాటక, కేరళ, తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలపై జీవన్ రక్షా అనే సంస్థ స్టడీ నిర్వహించింది. ప్రాగ్జిమా అనే ప్రైవేటు మేనేజ్మెంట్తో పాటు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆ సర్వేలో పాల్గొన్నాయి. బెంగుళూరులో మరణించిన అమ్మాయి వయసు 14 ఏళ్లు. ఆ బాలిక డయాబెటిక్ వ్యాధిగ్రస్తురాలు. హాస్పిటల్లో చేరిన 24 గంటల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇక హవేరీ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు హాస్పిటల్లో చేరిన 48 గంటల్లో మరణించినట్లు స్టడీ పేర్కొన్నది.