భోపాల్: కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు. భోపాల్లో విధించిన కరోనా కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటలతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో భోపాల్ జిల్లాతోపాటు బెరాసియా పట్టణంలో లాక్డౌన్ను మే 3 ఉదయం 6 గంటల వరకు పొడిగించారు. జిల్లా కలెక్టర్ అవినాష్ లావానియా ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ మేరకు ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో కరోనా కేసుల మొత్తం సంఖ్య 79 వేలకు, మరణాలు 700 దాటాయి.