వనపర్తి : జిల్లాలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని, 3 వంతెనలు, నాలుగు రహదారులకు రూ.15.90 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఘణపురం మండలం అపారెడ్డిపల్లి – ఆముదంబండ తండా రహదారిపై వంతెనకు రూ.కోటి 20 లక్షలు, గోపాల్ పేట మండలం గుడ్డిమోత వాగు వంతెనకు రూ.కోటి 28 లక్షలు, వనపర్తి మండలం చాకలిబండ వాగు వంతెనకు రూ.కోటి 80 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
ఘణపురం మండలం మానాజిపేట – గట్టుకాడిపల్లి రహదారికి రూ.2 కోట్ల 99.70 లక్షలు, అప్పారెడ్డిపల్లి – ఆముదంబండ తండా రోడ్డుకు రూ.4 కోట్ల 70.50 లక్షలు, పెబ్బేరు మండలం సూగూరు – మునగమాన్ దిన్నె రోడ్డుకు రూ. కోటి 83.10 లక్షలు, రేవల్లి మండలం తల్పునూరు – కేశంపేట తండా రోడ్డుకు రూ.2 కోట్ల 9 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.