న్యూఢిల్లీ: రెండు నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలపై చేపట్టనున్న ‘కొవాగ్జిన్’ టీకా ట్రయల్స్ మరో 10-12 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా చికిత్సకు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ను 2-18 ఏండ్ల వారిపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే అనుమతులనిచ్చింది. 525 మంది వలంటీర్లపై ఈ ప్రయోగాలు చేపట్టనున్నారు.