మిడ్జిల్, జూలై 13: సీపీఎం నాయకురాలు, ఐద్వా జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణమ్మ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన అరుణమ్మ ప్రథమ వర్ధంతి సభలో వారు పాల్గొని మాట్లాడారు. అంతకుముందు వాడ్యాల్ గ్రామంలో అరుణమ్మ స్మారకస్థూపం వద్ద నివాళులర్పించారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం అరుణమ్మ జీవితచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు, నాయకులు వెంకట్, జ్యోతి, ముల్లులక్ష్మి, రాములు, గోపాల్, సాగర్, వెంకట్రాములు, జబ్బార్, విజయ్కుమార్, నర్సింహులు, ప్రవీణ్కుమార్, తిరుపతయ్య, రాజేశ్, రాందాసు తదితరులు పాల్గొన్నారు.