పక్కింట్లో స్వీట్లు దొంగలించిన బాలున్ని వదిలేయాలన్న కోర్టు
నలంద: బంధువుల ఇంట్లో స్వీట్లు, ఫోన్ దొంగతనం చేసిన ఓ బాలుడిని వదిలేయాలని బీహార్లోని నలంద జువెనైల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అతనిపై కేసు నమోదు చేయవద్దని పేర్కొన్నది. కృష్ణుడు కూడా చిన్నప్పుడు తుంటరి పనులు చేశాడని, ఆ దృష్టితోనే పిల్లల ప్రవర్తనను చూడాలని వ్యాఖ్యానించింది. బాలుడు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు పక్కింట్లో స్వీట్లు దొంగతనం చేసి తిన్నాడు. ఫోన్ను ఎత్తుకొచ్చి ఆడుకొన్నాడు. ఇది చూసిన బంధువులు అతన్ని పోలీసులకు అప్పగించారు.