నిజామాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి కుమారుడు ఆనంద్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆనంద్ రెడ్డిని కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా…చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈరోజు నిజామాబాద్లో ఆనంద్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కేశ్పల్లి ఆనంద్ రెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.