పాల్ఘర్: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆ మత్స్యకారుడు ఇంటికి కోటీశ్వరుడిగా తిరిగొచ్చాడు. అతని వలలో అనూహ్యంగా ఖరీదైన ‘ఘోల్’ చేపలు పడ్డాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన చంద్రకాంత్ తారే ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లాడు. అతని వలలో 157 ఘోల్ చేపలు చిక్కాయి. ఈ మత్య్సాల్లోని ఔషధ గుణాల వల్ల వాటికి చాలా గిరాకీ ఉంది. చంద్రకాంత్ వద్ద ఉన్న చేపలను వ్యాపారులు రూ.1.33 కోట్లకు కొనుక్కొన్నారు.