శామీర్పేట, జూలై 7 : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున 3 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం మంత్రి మల్లారెడ్డితో కలిసి పట్టణ ప్రగతి, హరితహారంలో పాల్గొని మొక్కలు నాటడంతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జవహర్నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్గుప్తా, అడిషనల్ కలెక్టర్లు శ్యామ్సన్, నర్సింహారెడ్డి, కమిషనర్ గోపి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.