హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ తిరుపతిరావు మణిపూర్ యూనివర్సిటీ (ఇంఫాల్) చాన్స్లర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఇటీవలే ఉత్తర్వులు విడుదలచేసింది. ఐదేండ్లపాటు ఆయన చాన్సలర్గా వ్యవహరిస్తారు.