ప్రస్తుతం కరోనా చికిత్సలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు కీలకంగా మారాయి.. బాధితులు ఎంత డబ్బు అయినా వెచ్చించి వాటిని కొనుగోలు చేస్తున్నారు.. దీన్ని ఆసరగా చేసుకుంటున్న కొందరు మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి.. అధిక ధరలకు విక్రయిస్తున్నారని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇంజక్షన్ల బ్లాక్ దందాపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సోదా లు జరిపి నిందితులను అదుపులోకి తీసుకుని, ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో టాస్క్ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి.. కట్టడి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్ల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించేవారిపై డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం. 9490617111, సైబరాబాద్ వాట్సా ప్ -9490617444కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. కాగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను డ్రగ్ కంట్రో ల్ అధికారుల ద్వారా వాటిని ప్రభు త్వ దవాఖానలకు అందిస్తున్నారు. బాధితులకు ఉపశమనం కల్పిం చాలనే ఉద్దేశ్యంతోనే పోలీసులు ఇలా చేస్తున్నారు.
మలక్పేట, మే 2 : రెమిడెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశా రు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహ్మద్ అబ్దుల్ నయీం, మహ్మద్ మునావర్ ఖాద్రీ, మహ్మ ద్ అబ్దుల్ ఉస్మాన్లు ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురు శనివారం మూసారాంబాగ్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తుండగా మలక్పేట పోలీసులు.. సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి పట్టుకుని, వారి నుంచి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
చర్లపల్లి, మే 2 :రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఓ ఐటీ ఉద్యోగిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్చేసి.. మూడు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని నార్త్ కమలానగర్కు చెందిన గుబ్బాల వరుణ్ ఐటీ ఉద్యోగి… కాగా.. తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఆదివారం రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్లో విక్రయిస్తుండగా మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి మూడు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
జవహర్నగర్, మే 2: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఓల్డ్ సఫిల్ గూడ భరత్ నగర్కు చెందిన కొప్పుల చరణ్ను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకుని జవహర్నగర్ పొలీసులకు అప్పగిం చారు. అతడి నుంచి మూడు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.