త్రిపురారం, ఏప్రిల్ 11 : నాగార్జునసాగర్లో నోముల భగత్ గెలుపును ఎవరూ ఆపలేరని, కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లొచ్చిన రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఏడుసార్లు నాగార్జునసాగర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా.. జానారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. తండాల్లో భగత్కు నీరాజనాలు పలుకుతున్నారని, భారీ మెజార్టీ ఖాయమని అన్నారు. వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, కోలాటాలు, డప్పులు, బతుకమ్మలతో మంగళహారతులు ఇస్తున్నట్లు తెలిపారు.
జానాపై విరక్తి చెంది 2018లోనే ప్రజలు ఇంటికి పంపారని పేర్కొన్నారు. కారు గుర్తుపై ఓటేసి భగత్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, అనంతరెడ్డి, సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, జంగిలి శ్రీను, శ్యాంసుందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఫ్రాంఛైజీలు మారిన జాదవ్, భజ్జీ..తుది జట్టులో చోటు దక్కేనా?
మళ్లీ ఇన్ఫీ షేర్ల బైబ్యాక్:14న నిర్ణయం!