మూతబడిన బడులు, కాలేజీలు
40 రోజులు నడిచిన విద్యాసంస్థలు
ఆన్లైన్ తరగతులు యధాతథం
కరోనా వ్యాప్తితో నిర్ణయం
మహబూబ్నగర్ టౌన్/వనపర్తి టౌన్, మార్చి 24 : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యకళాశాలలు మినహా అన్ని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో బుధవారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. బస్టాండ్ ప్రాంగణాలు విద్యార్థులతో కిటకిటలాడాయి. ఆన్లైన్ తరగతులకు యథావిధిగా కొనసాగేందుకు అనుమతిచ్చారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9 ఆపై తరగతులకు బడులు మొదలయ్యా యి. అదే నెల 24వ తేదీన 6 నుంచి 8వ త రగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. వి ద్యార్థులు గుమిగూడడం.. కరోనా నిబంధనలు పా టించకపోవడంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో సమ స్య తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థ లు తాత్కాలికంగా బంద్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో ప్రారంభమైన 40 రోజుల తరువాత మళ్లీ విద్యాసంస్థలు మూతబడ్డాయి. కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు ప్రస్తు త నిబంధనల మేరకు 3 నుంచి 10వ తరగతి వర కు ఆన్లైన్ విద్య బోధన ఉండనున్నది.