HomeTelanganaCorona Effect On Srirama Navami Celebrations
రాములోరి కల్యాణం నిరాడంబరంగానే
మంత్రి పువ్వాడ వెల్లడి
ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా భద్రాచలంలో ఏప్రిల్ 21న జరిగే శ్రీరామనవమి, సీతారామ కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత మిథిలా స్టేడియంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, అయితే భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పెరుగుతున్న కొవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని గతేడాది మాదిరిగానే ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో సంప్రదాయబద్ధంగా శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పిస్తామన్నారు. భక్తులు కల్యాణ వేడుకను ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.