నాగర్కర్నూల్ టౌన్, మార్చి 28: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో ప్రజలు హోలీ వేడుకలను జరుపుకున్నారు. సోమవారం హోలీ సెలవు కావడంతో ఆదివా రం కొన్ని వీధుల్లో మాత్రమే హోలీ సంబురాలు జరుపుకొన్నారు. నాగర్కర్నూల్ బీజేపీ కార్యాలయం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో హోలీ సంబురాలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బల్మూరు జానకి, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజారమణి, రాష్ట్ర మహిళా మోర్చా సభ్యురాలు దొడ్ల రాధారెడ్డి, జనరల్ సెక్రటరీ అపర్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండా మణెమ్మ, మహిళా మోర్చా ఉపాధ్యక్షురా లు ఇందిర, జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్రెడ్డితోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బిజినేపల్లిలో..
బిజినేపల్లి, మార్చి 28 : మండలంలోని ఆయా గ్రామాల్లో హోలీ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పా లెం, బిజినేపల్లి, మంగనూర్ తదితర గ్రామాల్లో హోలీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు.
చారకొండలో..
చారకొండ, మార్చి 28: మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామాల్లో యువకులు, మహిళలు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. శేరిఅప్పారెడ్డిపల్లి, చారకొండ, మర్రిపల్లి, తుర్కలపల్లి, సిరుసనగండ్ల తదితర గ్రా మాల్లో డప్పులు కొడుతూ వేడుకలు జరుపుకొన్నారు.