అంగళ్ల నిర్వహణకు జీపీలు టెండర్లు
కూటమి కట్టి గుత్తేదార్ల అవగాహన
తక్కువ ప్రైస్పై దక్కించుకోవడానికిపంపకా లు
వేలంలో అప్సెట్ కంటే తక్కువ రేట్లు
పంచాయతీల ఆదాయానికి భారీగా గండి
వరంగల్రూరల్, మార్చి 29(నమస్తేతెలంగాణ): వార సంతల్లో గుత్తేదార్లు సిండికేట్లుగా అవతారమెత్తుతున్నారు. కూటమి కట్టి అవగాహనతో వాటాలుగా తీసుకుని పంచాయ తీల ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని తైబజార్(కూరగాయలు), గొర్రెలు, మేకలు, పశువుల వార సంతల నిర్వహణకు యేటా మార్చి నెలాఖరులో ప్రభుత్వ అనుమతితో నోటిఫికేషన్ జారీ చేసి బహిరంగ వేలం నిర్వహిస్తుంది. ఇందులో రహదారి వసూలు కోసం నిబంధనల ప్రకారం గుత్తేదార్లు ప్రభుత్వం నిర్ణయించి న ఫీజును నిర్ణీత గడువులోగా డీడీ రూపంలో చెల్లించి వేలం లో పాల్గొంటారు. ముందుగా నిర్ణయించిన అప్సెట్ ప్రైస్ లేదా అంతకంటే ఎక్కువగా చెల్లించి ఏడాదిపాటు నిర్వహిం చేందుకు వేలంలో ముందుకొచ్చిన గుత్తేదారుకు వార సంత ను గ్రామపంచాయతీ కేటాయిస్తుంది. ఈ క్రమంలో గుత్తేదా ర్లు సిండికేట్గా ఏర్పడి ఒకరిద్దరు మాత్రమే అప్సెట్ కంటే తక్కువ మొత్తం చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వరుసగా మూడుసార్లు వేలం నిర్వహించాక అప్సెట్ ప్రైస్ రాకపోతే గుత్తేదార్లలో ఎక్కువగా చెల్లిస్తామన్న వారికే సంతను కేటాయించడంపై తీర్మానం చేసి అనుమతి కోసం డివిజనల్, జిల్లా పంచాయతీ అధికారికి పంపిస్తుంది. పరిశీలించిన అధి కా రులు కొన్ని సందర్భాల్లో ఆమోదముద్ర వేస్తున్నారు. ఇలా గుత్తేదార్ల సిండికేట్, కొందరు అధికారుల తీరు వల్ల పంచా యతీలు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతు న్నాయి.
వరంగల్ రూరల్ జిల్లాలో మచ్చుకు కొన్ని,,
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెద్ద వార సంతల్లో గీసుగొం డ మండలంలోని కొమ్మాల ఒకటి. ఇది విశ్వనాథపురం గ్రా మం వద్ద ప్రతి శనివారం పనిచేస్తుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో గొర్రెలు, మేకలు, పశువుల అమ్మకం, కొనుగోలు జరుగుతుం ది. కొమ్మాల, విశ్వనాథపురం, నందనాయక్తండా, సూర్య తండా, దస్రుతండా గ్రామపంచాయతీలకు కొమ్మాల వార సంత ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఈ సంతను ఆ యా గ్రామపంచాయతీ ఎన్ని వారాలు నిర్వహించుకోవాలనే ది పంచాయతీశాఖ ముందుగానే నిర్ణయిస్తది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం కొమ్మాల పంచాయతీ ఇటీవల టెండరు ప్రక్రియ చేపట్టింది. 19 మంది గుత్తేదార్లు ముందు కు రాగా, మూడుసార్లు బహిరంగ వేలం నిర్వహించింది. చివ రకు ఓ గుత్తేదారు కేవలం సుమారు రూ. 38 లక్షలు చెల్లిం చేందుకు ప్రకటించాడు. ప్రభుత్వం ఫిక్స్ చేసిన అప్సెట్ ప్రైస్ దాదా పు రూ.60 లక్షలు. దీనికంటే వేలంలో ఓ గుత్తేదారు చెల్లిస్తానన్న మొత్తం చాలా తక్కువగా ఉండడంతో పంచా య తీ ఈ వార సంత టెండర్ ఖరారు(శేబార్) చేయలేదు. ఇక్కడ టెండరులో పాల్గొన్న గుత్తేదార్లు సిండికేట్గా ఏర్పడి అవగాహన కుదుర్చుకో వడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
నెక్కొండ మండల కేంద్రంలో ప్రతి మంగళవారం గొర్రెలు, మేకలు, పశువుల సంత, తైబజార్(వెజిటబుల్) సంత వేర్వేరుగా నిర్వహించేందుకు పంచాయతీ ఇటీవల టెండర్ల ప్రక్రియ చేపట్టింది. తైబజార్కు మూడు సా ర్లు వేలం నిర్వహించగా, ఏడుగురు గుత్తేదార్లు పాల్గొన్నారు. ఇందులో అప్సెట్ ప్రైస్ రూ. 5 లక్షలు కాగా, రూ.2.30 లక్ష ల వరకు మాత్రమే చెల్లించేందుకు ముందుకువచ్చారు. ఇక్క డా గుత్తేదార్లు కూటమికట్టడమే కారణమని తెలిసింది.
పర్వతగిరి మండల కేంద్రంలోని వెజిటబుల్, పశువుల సంత ప్రతి సోమవారం పనిచేస్తుంది. దీనికి గ్రామపంచా యతీ ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించగా, పదహారు మంది గుత్తేదార్లు ముందుకొచ్చారు. ఈ వార సంత అప్సెట్ ప్రైస్ సుమారు రూ.5 లక్షలకుపైగా ఉంది. కొద్దిరోజుల నుంచి పంచాయతీ మూడు సార్లు ఏర్పాటు చేసిన బహిరంగ వేలం లో గుత్తేదార్లలో ఎట్టకేలకు ఒకరు రూ.4.77 లక్షలు చెల్లిస్తా నని ప్రకటించారు. మరొకరు రూ.4.76 లక్షలు ఇస్తానని పే ర్కొన్నారు. ఇక్కడ గుత్తేదార్లు సిండికేట్గా ఏర్పడడమే ఇందు కు కారణమని తెలిసింది.
రాయపర్తి మండల కేంద్రంలోని వెజిటబుల్, పశువుల సంత టెండర్ కూడా ఖరారు కాలేదు. ఈ వార సంత ప్రతి గురువారం పనిచేస్తుంది. దీని నిర్వహణకు గ్రామ పంచాయ తీ ఇటీవల టెండర్లు నిర్వహించగా, 12 మంది గుత్తేదారులు ముందుకొచ్చారు. కొద్దిరోజుల నుంచి మూడుసార్లు బహి రంగ వేలం జరిగింది. ఈ సంత అప్సెట్ ప్రైస్ సుమారు రూ. 3.50 లక్షలని తెలిసింది. గుత్తేదార్లు మాత్రం రూ.3.04 లక్ష లు మాత్రమే చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీం తో పంచాయతీ దుబారదుబార (పెండింగ్)లో పెట్టింది.