న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బజాజ్ ఆటో సంస్థ సరికొత్త పల్సర్ ఎన్ఎస్-125 బైక్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 125 సీసీ సామర్థ్యం కలిగిన బీఎస్-3 డీటీఎస్-ఐ ఇంజిన్తో నడిచే ఈ బైక్ ధరను రూ.93,690 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. గరిష్ఠంగా 12 పీఎస్ శక్తిని, 11 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తిచేసే ఈ బైక్ అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా స్థిరంగా ఉండేలా నైట్రాక్స్ మోనో-షాక్ అబ్జార్బర్లను పొందుపర్చినట్లు బజాజ్ ఆటో మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.