తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతున్నది. వారం క్రితం 15 వేల దిగువకు పడిపోయిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఆ తర్వాత అమాతం పెరిగిపోయింది. గత ఆరు రోజుల నుంచి వరుసగా 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా 20,728 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,11,489కి చేరింది.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా 56 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 16,837కు పెరిగింది. జూలై 27 నుంచి ఇవాళ్టి వరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం 1,28,373 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక మొత్తం కేసులలో ఇప్పటివరకు 32,26,761 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా మరో 1,67,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.