ముంబై : ఔరంగాబాద్లో ఈ నెల 31వ తేదీ నుంచి అమలు కావాల్సిన లాక్డౌన్ను రద్దు చేస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ సునీల్ చౌహాన్ స్పష్టం చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు లాక్డౌన్ విధించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ప్రజలు వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు కేంద్రం గుర్తించిన పది జిల్లాల్లో ఔరంగాబాద్ కూడా ఉంది. మహారాషర్టలో నిన్న ఒక్కరోజే కొత్తగా 27,918 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాబోయే రోజుల్లో కేసులు పెరిగితే లాక్డౌన్ విధించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం ఉద్ధవ్ థాకరే అధికారులను ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..