న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్లో మంత్రులు చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఆమోదించారు. సీనియర్ మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్దన్, రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గాంగ్వార్, సదానంద గౌడ, బాబుల్ సుప్రియో సహా 15 మంది మంత్రులు ఇప్పటి వరకు రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది. రాజీనామా చేసే మంత్రుల జాబితా పెరుగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ భారీ ప్రక్షాళనకు పూనుకున్నట్లు సమాచారం.
యువ రక్తానికి చోటు కల్పించడంతోపాటు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని మోదీ భావిస్తున్నారని తెలుస్తున్నది.
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
హైదరాబాద్ రియల్టీలోకి వారెన్ బఫెట్
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
మలబార్ గోల్డ్లో 5వేల ఉద్యోగాలు